ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఆర్థిక సాయం అందించే సిఎంఆర్ఎఫ్ ఫైల్పై తొలి సంతకం చేశారు. ₹55.63 కోట్లతో 6787 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో సిఎంఆర్ఎఫ్, వైద్య సాయం, ఎల్ఓసి ద్వారా మొత్తం ₹1,241 కోట్ల సహాయం అందించారు. ఈ కాలంలో 1,36,240 మందికి పైగా లబ్ధిదారులు సాయం పొందారు.